నేడు ప్రపంచకప్ మెగా టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు టీమిండియా ప్రపంచకప్ సాధించాలని కోరుతూ పలు నగరాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేగాక చాలా నగరాల్లో విరాట్ కోహ్లి సేనకు మద్దతుగా అభిమానులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పలు నగరాల్లో క్రికెటర్లకు సంబంధించి పెద్ద పెద్ద పోస్టర్లను పెడుతున్నారు. ఇతర క్రీడలతో పోల్చితే భారత్లో క్రికెట్కు ఉన్న ఆదరణ మాటల్లో వర్ణించలేం. చిన్నపెద్ద తేడా లేకుండా క్రికెట్ను ఆస్వాదించడం సంప్రదాయంగా మారింది. క్రికెట్ను ప్రాణంగా భావించే కోట్లాది మంది అభిమానులు భారత్లో ఉన్నారు. ఇక, ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో విరాట్ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్ సాధించాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జట్టు విజయం కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.