శనివారం సచివాలయంలో అడుగుపెట్టనున్న జగన్!

SMTV Desk 2019-05-30 13:04:13  ysrcp

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లి ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతారు. ఆపై, రాష్ట్రానికి తిరిగివచ్చి శనివారం నుంచి పరిపాలన మొదలుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇప్పటికే సచివాలయంలో సీఎం చాంబర్ ను సరికొత్తగా ముస్తాబు చేశారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్ లతో పాటు సీఎం నేమ్ ప్లేట్ ను కూడా వైసీపీ ముఖ్యనేత, జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. సీఎం చాంబర్ లో మార్పులు చేర్పులు, సీఎం నేమ్ ప్లేట్ తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. వైవీ ఆమోదించిన తర్వాతే పలు మార్పులను ఖరారు చేశారు.