ఐసిసి తాజాగా టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించింది. ఈ షోలో జడేజా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. భారత జట్టులో శిఖర్ ధావన్ సెల్ఫీ లవర్ అంటూనే మహేంద్ర సింగ్ ధోనీ ఓ చెత్త డ్యాన్సర్ అతనికి డ్యాన్స్ వేయడమే రాదని చెప్పేశాడు. తనను కోహ్లీ ఎప్పుడూ జడ్డూ అనే పిలుస్తాడని తెలిపాడు.ఖాళీ సమయాల్లో రొమాంటిక్ కామెడీ మూవీస్ ఎవరు ఎక్కువగా చూస్తారంటే బుమ్రా, చాహల్ అని సమాధానమిచ్చాడు. ఇంకా రోహిత్ శర్మ బస్ ఎక్కడానికి ఎప్పుడూ లేట్ గానే వస్తాడట. కోహ్లీ మాత్రం ఎప్పుడూ జిమ్ లోనే కాలం గడుపుతూ కనిపిస్తాడట. ఇలా తాను ఇచ్చిన పర్సనల్ ఇంటర్వ్యూలో సరదాగా భారత ప్లేయర్ల గురించి చెప్పుకొచ్చాడు.