భారత హాకీ సిరీస్‌ టోర్నీలోకి రమణ్‌దీప్‌సింగ్‌ ఎంట్రీ

SMTV Desk 2019-05-30 12:43:48  Ramandeep Singh

జూన్‌ 6న భువనేశ్వర్‌ వేదికగా ప్రారంభమయ్యే పురుషుల హాకీ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్ లో ఆడే భారత హాకీ జట్టులో స్ట్రైకర్‌ రమణ్‌దీప్‌సింగ్‌ చోటు సంపాదించాడు. గత తొమ్మిది నెలల నుండి మోకాలి గాయం కారణంగా విరామం తీసుకున్న తర్వాత రమణ్‌ తిరిగి జట్టులోకొచ్చాడు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు మన్‌ప్రీత్‌సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. బీరేంద్ర లాక్రా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. పూల్‌-ఏలో రష్యా, పోలెండ్‌, ఉజ్బెకిస్థాన్‌తో భారత్‌ ఆడనుంది. జూన్‌ 6న రష్యాతో పోరాటంతో భారత్‌.. ఈ టోర్నీని ప్రారంభిస్తుంది. ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిస్తే భారత్‌.. ఒలింపిక్స్‌ క్వాలిఫైయింగ్‌ ఈవెంట్‌కు అర్హత సాధిస్తుంది. పూల్‌-బిలో జపాన్‌, మెక్సికో, యుఎస్‌ఏ, దక్షిణాఫ్రికా ఆడనున్నాయి.