ప్రొ కబడ్డీ లీగ్ 7 కు ముహూర్తం ఖరారు

SMTV Desk 2019-05-29 15:30:11  pro kabaddi league, pro kabaddi league 7

జూలై 20 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్‌) ఏడవ సీజన్‌ ప్రారంభం కానుంది అని లీగ్ నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సీజన్‌లో మ్యాచ్‌లు రాత్రి 7.30కు ఆరంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌లు ఇంతకు ముందు రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యేవి.ప్రొ కబడ్డీ లీగ్ సీజన్‌-7కు అన్ని సిద్ధమయ్యాయి. జులై-అక్టోబర్ నెలలో మళ్లీ వస్తున్నాం అని లీగ్ కమీషనర్, సీఈఓ అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ రైడర్లు రాహుల్ చౌదరి, సిద్దార్థ్ దేశాయ్, మోను గోయత్, సందీప్ నర్వాల్ వంటి పలువురు ఈ సీజన్‌లో కొత్త జట్లకు ఆడుతున్నారు. పర్దీప్ నర్వాల్, పవన్ కుమార్, అజయ్ ఠాకూర్, ఫజల్ వంటి ఆటగాళ్లు పాత జట్లకు ఆడుతున్నారు.బెంగళూరు బుల్స్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత సీజన్‌-6లో స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ నేతృత్వంలోని బెంగళూరు బుల్స్ విజేతగా నిలిచింది. గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 38-33తో తేడాతో బెంగళూరు విక్టరీ సాధించి కప్ ఎగరేసుకుపోయింది. సీజన్-5లో కూడా గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.