మంగళవారం టీంఇండియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఓపెనర్లు విఫలమై కుదేలైన టీమిండియాను ఆదుకునే బాధ్యత తీసుకున్నాడు కేఎల్ రాహుల్. క్రీజులో నిలదొక్కుకుంటున్న క్రమంలో విజయ్ శంకర్ 2పరుగులకే పెవిలియన్ చేరాడు. అదే సమయంలో క్రీజులోకి వచ్చిన ధోనీ బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తాను గేమ్ చేంజర్ అని మరోసారి చాటాడు. ఇలా రాహుల్, ధోనీల సెంచరీకి మించిన స్కోరుతో భారత్ 359పరుగులకు మించిన స్కోరు నమోదు చేసి 95పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే అదే సమయంలో బంగ్లాదేశ్ ఫీల్డింగ్లోనూ సాయపడేందుకు ప్రయత్నించాడు. ఇండియా ఇన్నింగ్స్ 40వ ఓవర్లో ధోనీ స్ట్రైకింగ్లో ఉన్నాడు. ఫీల్డర్లలో ఒకరు తన పొజిషన్ను వదిలేసి పక్కకు నిల్చొని ఉన్నాడు. అది గమనించిన ధోనీ బౌలర్కు సమాచారం ఇచ్చాడు. బౌలర్ సబ్బీర్ రెహ్మాన్ ఆశ్చర్యానికి గురై ఫీల్డర్కు తన పొజిషన్ మార్చుకోవాలని సూచించాడు. ఈ ఘటనతో అంపైర్తో ఎంఎస్ ధోనీ, కేఎల్ రాహుల్లు కాసేపటి వరకూ నవ్వుకుంటూనే ఉన్నారు.