ఓహియో: అమెరికాలో మరోసారి టోర్నడోలో భీభత్సం సృష్టించాయి. మధ్య అమెరికా రాష్ట్రం ఓహియోలో టోర్నడో ధాటికి వందలాది ఇళ్లు నేలకూలాయి. పలువురు గాయపడ్డారు. విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోవడంతో లక్షలాది ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. అంతేకాక టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయి. కూలిపోయిన భవనాలను మరమ్మతులు చేసే పనిలో అధికారులు, ప్రజలు నిమగ్నమయ్యారు.