మోదీ ప్రభుత్వం అందించే తొలి కానుక!!

SMTV Desk 2019-05-29 14:46:41  modi

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీనిని గుర్తించిన మోదీ సర్కార్ ఇంటింటికీ అత్యంత చవకైన ఏసీలు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే... ప్రభుత్వం అందించే ఈ ఏసీలు 15 నుంచి 20 శాతం తక్కువ ధరకు లభ్యంకానున్నాయి. ఈ ఏసీలను ఈసీఐఎల్ ఆవిష్కరించనుంది. ఈ ఏసీలు అందుబాటు ధరల్లో లభ్యమవడమే కాకుండా విద్యుత్ తక్కువగా ఖర్చుకానుంది. పైగా ఈ ఏసీలను ఇంట్లో కూర్చొనే కొనుగోలు చేయవచ్చు. పైగా ఎక్స్ఛేజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. అయితే ఈ ఏసీలు రాబోయే నెల-రెండునెలల్లో అందుబాటులోకి రానున్నాయి. కాగా గతంలో ఈసీఐఎల్ కంపెనీ అత్యంత తక్కవ ధరలకు ఎల్ఈడీ బల్బులను ట్యూబ్ లైట్లను అందించింది.