ఈ నెల 30వ తేదీన జరిగే ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్టీ హజరుకానున్నారు. మోడీ ఆహ్వానంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల వలెనే నాకు కూడా మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపారు. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను అని మమతా స్పష్టం చేశారు. మొత్తానికి మోడీకి దేశ ప్రజలు అందించిన మెజారిటీని చూసి మమతా బెనర్జీ దిగొచ్చారండోయ్.