వరుసగా రెండో రోజు లాభాల్లో ముగింపు

SMTV Desk 2019-05-29 11:02:21  Sensex, Nifty, Stock market, Share markets

వరుసగా రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. మొదట్లో ఒడిదుడుకులకు గురైన బెంచ్‌మార్క్ సూచీలు చివరిలో కొనుగోళ్ల కారణంగా స్వల్ప లాభాలతోనే ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 39,750 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 11,929 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, యస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, రిలయన్స్, విప్రో, ఐఓసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. యస్ బ్యాంక్ 4 శాతానికి పైగా పెరిగింది. అదేసమయంలో భారతీ ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి. బజాజ్ ఆటో 3 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియల్టీ మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ఎక్కువగా పడిపోయాయి.