"భరత్ అను నేను" కోసం 2 కోట్లతో అసెంబ్లీ సెట్..!

SMTV Desk 2017-08-27 15:36:48  mahesh babu, koratala shiva, bharth anu nenu, assembly set, 2 crores.

హైదరాబాద్, ఆగస్ట్ 27 : మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన "శ్రీమంతుడు" మూవీ మంచి సూపర్ హిట్ ను సాధించి౦ది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కలయికలో తెరకెక్కిస్తున్న మరో చిత్రం "భరత్ అను నేను". ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో సాగనుండడంతో అసెంబ్లీ సన్నివేశాలను సహజంగా తెరకెక్కించే దిశగా చిత్రబృందం ప్రయత్నిస్తుంది. దీనికోసం హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో అసెంబ్లీ సెట్ వేసి చిత్రీకరణ జరుపనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను చిత్రబృందం శరవేగంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సెట్లో షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో అసెంబ్లీ సెట్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ఫిలింనగర్ టాక్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు ఆలోచనలో ఉన్నారు.