అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంటే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుందా!

SMTV Desk 2019-05-28 16:42:45  money accounts

ప్రతీ బ్యాంకు ఖాతాదారుడు మే 31న మీ అకౌంట్‌లో కొంత బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) పాలసీల ప్రీమియం మే 31న అకౌంట్ల నుంచి డెబిట్ అవుతుంది. బ్యాంకులు ఇప్పటికే కస్టమర్లకు దీనికి సంబంధించి అలర్టులు పంపాయి. ఒకవేళ మీ అకౌంట్‌లో మే 31న డబ్బులు లేకపోతే మీరు ఈ రెండు స్కీమ్స్ ప్రయోజనాలు పొందలేరు. పీఎంఎస్‌బీవై కింద పాలసీదారులకు రూ.2 లక్షల కవరేజ్ లభిస్తుంది. దీనికి సంవత్సరానికి రూ.12 ప్రీమియం చెల్లించాలి. పాలసీదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యానికి రూ.1 లక్ష ఇన్సూరెన్స్ మొత్తం వస్తుంది. ఇక పీఎంజేజేబీవై అనేది జీవిత బీమా పాలసీ. పాలసీదారుడు చనిపోతే నామినీకి రూ.2 లక్షలు అందుతాయి. 55 ఏళ్ల వరకు పాలసీ వర్తిస్తుంది. దీనికి వార్షిక ప్రీమియం రూ.330.