ఇప్పుడు ఆమె టార్గెట్....కియారా అద్వాని

SMTV Desk 2019-05-28 10:59:14  rangoli

"ఇలాంటి సినిమాలు తీయ‌డానికి సిగ్గుండాలి. ఇలాంటి సినిమాలు తీసిన త‌ర్వాత మేక‌ర్స్ వారి కుమార్తెల క‌ళ్ల‌ల్లోకి చూడ‌గ‌ల‌రా?" అంటూ హీరోయిన్ కియారా అద్వానిపై కంగనా సోద‌రి రంగోలి పైర్ అయ్యారు. ఇంత‌కు రంగోలి ఫైర్ కావడానికి కార‌ణం.. కియారా త‌న కొత్త సినిమా ఇందు కీ జ‌వానీ గురించి చెప్పడమే.

తెలుగులో భ‌ర‌త్ అనే నేను , విన‌య‌ విధేయ‌ రామ‌ చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని ప్రస్తుతం ఈమె న‌టించిన క‌బీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) రీమేక్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. కాంచ‌న రీమేక్ ల‌క్ష్మీబాంబ్‌ లో కూడా కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రాలు కాకుండా తాజాగా కియారా ఇందు కీ జ‌వానీ అనే చిత్రంలో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

ఇందులో కియారా డేటింగ్ యాప్‌లో అబ్బాయిల ప్రొఫైల్స్ చూసి ఎంపిక చేసుకుని డేటింగ్ చేయాల‌నుకునే పాత్ర‌లో క‌న‌పించ‌నుందట‌. దీని వ‌ల్ల ఆమెకు ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌నేదే అస‌లు క‌థ‌ట‌. ఈ సినిమా గురించి కియ‌రా అద్వాని చెప్ప‌గానే కంగన ర‌నౌత్ సోద‌రి రంగోలి.. కియారా అద్వానిపై ఫైర్ అయ్యింది. మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడుతూ వారిని ఆట బొమ్మ‌లుగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను సెన్సార్ అంగీక‌రిస్తే భావిత‌రాలు త‌ల‌దించుకునే రోజులు వ‌స్తాయంటూ రంగోలి కియారాపై ఘాటుగానే స్పందించారు.