మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

SMTV Desk 2017-08-27 10:14:10  petrol, diesel, rates increse

హైదరాబాద్, ఆగస్ట్ 27 : నిత్యం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచేశాయి. పెట్రోల్ ధరలను 5 పైసల వరకు, డీజిల్ ధరలను 7 పైసల వరకూ పెంచుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 73.12 ఉండగా, డీజిల్ రూ. 61.96కు పెరిగింది. వివిధ ప్రాంతాలలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ: పెట్రోలు రూ. 69.06, డీజిల్ రూ. 57.03 కోల్ కతా: పెట్రోలు రూ. 71.82, డీజిల్ రూ. 59.69 ముంబై: పెట్రోలు రూ. 78.18, డీజిల్ రూ. 60.58 చెన్నై: పెట్రోలు రూ. 71.56, డీజిల్ రూ. 60.04 హైదరాబాద్: పెట్రోలు రూ. 73.12, డీజిల్ రూ. 61.96 గా ఉన్నాయి.