న్యూఢిల్లీ, ఆగస్ట్ 26: వైసీపీ,ఎన్డీయేలు జతకట్టబోతున్నాయని వస్తున్న ప్రకటనల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను మీడియా ప్రశ్నించగా, టీడీపీతో ఎలాంటి సమస్య లేదు. ఎప్పటిలానే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, గత కొంత కాలంగా వైసీపీ, భాజపాలు కలవబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అయితే భాజపా తెలంగాణలో ఎలాంటి పొత్తులు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. జాతీయంగా భాజపాకు మద్దతు బాగుంది, చాలా రాష్ట్రీయ పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన ప్రకటించారు. ఇటీవల బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఇదే విషయంపై స్పందిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపిన సంగతి తెలిసిందే.