హైదరాబాద్, ఆగస్ట్ 26 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన "జల్సా", "అత్తారింటికి దారేది" సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కలయికలో మరో చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచుకున్నారు. ఈ చిత్ర టైటిల్ ను సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా విడుదల చేయనున్నట్లు తెలిసిందే. కాగా ఈ సినిమా కొనుగోలుపై నిర్మాతలు స్పందిస్తూ.. ఓవర్సీస్ లో 25 కోట్లకు అమ్మడానికి సిద్దపడ్డారు. అయితే బ్లూ స్కై సంస్థ వారు ఈ చిత్రాన్ని 19 కోట్లకి సొంతం చేసుకోవాలనుకున్నారు కానీ ప్రయోజనం లేకుండా పోయిందట. దీంతో 20 కోట్లు అవుట్ రేట్ .. 1 కోటి రికవరబుల్ ఎమౌంట్ గా ఇచ్చేందుకు బ్లూ స్కై వారు అంగీకరించినట్టు సమాచారం.