పాకిస్థాన్: శనివారం రాత్రి ముల్తాన్లో జరిగిన ఇఫ్తార్ విందుకి పాక్ విదేశాంగా మంత్రి మహమూద్ ఖురేష్ హాజరయ్యారు. అనంతరం అయన భారత్-పాకిస్థాన్ మధ్య ఏర్పాడిన పరిస్థితలపై చర్చలకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యాలు పెంపొందాలంటే చర్చలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన బిజెపికి పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందించిన విషయం తెలిసిందే.