జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.... చిక్కుల్లో పడిన టీడీపీ ఎమ్మెల్యే

SMTV Desk 2019-05-27 13:04:28  Jagan, rama krishna babu

ఏపీ ఎన్నికలలో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు టీడీపీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ టీడీపీ ఎమ్మెల్యే పార్టీ ఓడిందన్న బాధతో నోరు జారారు. ఏకంగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జగన్‌ను దర్భాషలాడినందుకు సదరు ఎమ్మెల్యేపై కేసు నమోదయ్యింది.

ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రామకృష్ణబాబు ప్రచార రథంపై నుంచి కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌ను అగౌరవపరిచేలా ఆయన మాట్లాడారంటూ ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మల ద్వారకానగర్‌ ఏసీపీ వైవీ నాయుడుకు ఫిర్యాదు చేశారు. ప్రసంగం వీడియోను కూడా ఫిర్యాదుకు జతచేశారు. వాటిని పరిశీలించిన ఏసీపీ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో రామకృష్ణబాబుపై శనివారం కేసు నమోదుచేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రౌడీల ప్రవర్తించారని ఆరోపించారు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్. అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా అసభ్యకరంగా ఆయన మాట్లాడిన తీరు దారుణమని మండిపడ్డారు.