సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉండే బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ తాజాగా ఎన్నికల ఫలితాలపై ట్విటర్ వేదికగా తనదైన శాలిలో స్పందించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఆప్, కన్హయ్య కుమార్, భోపాల్లో దిగ్విజయ్ సింగ్ల తరఫున స్వర భాస్కర్ ప్రచారం చేసినసంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రచారం చేసిన అభ్యర్థులేవరు విజయం సాధించలేదు. ఈ క్రమంలో ఆమె మోడీ మీదా, భోపాల్లో కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ మీద విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ మీదా కొన్ని అనుచిత ట్వీట్ లు చేశారు.
“అద్భుతమైన విజయం సాధించిన ప్రధాని మోదీకి అభినందనలనీ ప్రజాస్వామ్య పౌరులుగా వచ్చిన ఫలితాన్ని, ఓటర్ల ఆకాంక్షలను మేం గౌరవిస్తాం. చేసిన వాగ్దానాలను ప్రధాని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశం మొత్తానికి ప్రధాని. ఓటేయని వారికి కూడా ఆయన ప్రధాని” అంటూ ఆమె దెప్పి పొడిచింది. మరోపక్క ‘భారతదేశానికి కొత్త రోజులొచ్చాయి. తొలిసారి మనం ఉగ్రవాద ఆరోపణలు కలిగిన వ్యక్తిని పార్లమెంట్కు పంపుతున్నాం. ఇప్పుడు పాకిస్థాన్ గురించి ఏమని మాట్లాడుకోవాలి?’ అంటూ సాధ్విని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు స్వర. దీంతో ఆమె మీద విరుచుకు పడుతున్నారు మోడీ భక్తులు.