బద్రీనాథ్ లో అంబానీ ప్రార్థనలు... రూ. 2 కోట్లు విరాళం

SMTV Desk 2019-05-25 16:23:22  badrinath

ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత బద్రీనాథ్ ఆలయాన్ని రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ శనివారంనాడు దర్శించారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బద్రీనాథ్ కేదారినాథ్ ఆలయ కమిటీకి ఈ సందర్భంగా ఆయన రూ. 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంబానీకి బీకేటీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీడీ సింగ్ ధర్మాధికారి, ఆఫీసర్ భువన్ చంద్ర ఉనియల్ తదితరులు ఆలయం వద్ద సాదర స్వాగతం పలికారు.

బద్రీనాథ్‌ ఆలయంలో ప్రార్థనలు చేసిన అంబానీ దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. గర్భాలయంలో భగవద్గీత ప్రవచనాలను కూడా శ్రద్ధగా అలకించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పేరుతో తమిళనాడులోని శాండిల్‌వుడ్ ఆలయంలో భూమి కొనుగోలుకు కూడా అంబానీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇటీవల బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను ప్రధాని మోదీ సైతం సందర్శించారు.