2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వై.ఎస్.జగన్ను రాజకీయ ప్రముఖులే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా అభినందిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్న జగన్కు నాగార్జున, మహేష్, రవితేజ సహా హీరోలందరూ జగకు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో అక్కినేని ఫ్యామిలీ చెందిన హీరో సుమంత్ ఈ నెల 23 "మా కొత్త సీం వైఎస్.జగన్గారికి అభినందనలు` అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు... అందులో జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి .. సుమంత్ రెండు రోజుల తర్వాత ట్వీట్ను సవరించారు. కరెక్షన్ అంటూ "న్యూ ఏపీ సీఎంగారు" జగన్ను సంబోధిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు సుమంత్.