యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నరేంద్ర మోదీ అమోఘ విజయం సాధించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో వారణాసికి చెందిన ఒక చాయ్వాలా విజయోత్సాహంలో శుక్రవారం రోజంతా ఉచితంగా అందరికీ టీ పంపిణీ చేశాడు. కన్నయ్య అనే ఈ చాయ్వాలా వారణాసిలోని ఇంగ్లీషియా లైన్ క్రాసింగ్ వద్ద తన చాయ్ దుకాణం నిర్వహిస్తున్నాడు.
వారణాసిలో మోదీ వరుసగా రెండోసారి గెలుపొందారు. ఈసారి ఆయన తన ప్రత్యర్థి, సమాజ్వాదీ అభ్యర్థి షాలినీ యాదవ్ను 4.78 లక్షల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. మోదీకి 6,74,664 ఓట్లు లభించగా, షాలినీకి 1,95,159 ఓట్లు లభించాయి. కాగా మోదీ విజయోత్సాహంలో టీ పంపిణీ చేసిన కన్నయ్య సుమారు 500 లీటర్ల పాలను వినియోగించారు. ఈ సందర్భంగా కన్నయ్య మాట్లాడుతూ ‘మోదీ కాశీలో మరోమారు విజయం సాధించడంతో స్థానికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోదీ ఎన్నో మంచి పనులు చేశారు. మాకు మోదీపై ఎన్నో ఆశలున్నాయి’ అని అన్నారు.