ప్రారంభమైన ఆరోదశ పోలింగ్

SMTV Desk 2019-05-24 16:02:11  poling,

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా.. ఈరోజు ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ జరిగింది. ఈరోజు ఆరో దశ పోలింగ్ ప్రారంభమై.. ఉదయం 7 గంటలకు ఓటర్లు క్యూ లైన్లలో నిలుచుకొని వారి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ కొనసాగనుంది.

అదేవిధంగా పోలింగ్ లో భాగంగా కొన్ని సమస్యాత్యక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆరో విడతలో ఏడు రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు సమాయత్తమయ్యారు. 59 లోక్‌సభ స్థానాల బరిలో 979 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.