ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి భారీ షాక్

SMTV Desk 2019-05-24 16:00:42  IPL final.

ఐపీఎల్ 2019 సీజన్లో భాగంగా హైదరాబాద్ లో నేడు జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. శనివారం రాత్రి నుండి హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షాలు కురిశాయి… అంతేకాకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది… దానికి తోడు హైదరాబాద్ లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది… రోడ్ల మీద నీరు అలాగే నిలిచిపోయాయి. డ్రైనేజీ నుండి కూడా మురుగు నీరు బయటకు రావడంతో ట్రాఫిక్ మరింత ఇబ్బందిగా తయారయ్యింది. పలు చోట్ల చెట్లు కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంతేకాకుండా రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్ లో తీవ్ర వర్షం పడనుందని ఇప్పటికే వాతావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ఆదివారం నాడు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం లో జరగనున్నటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వర్ష ప్రభావం పెద్ద దెబ్బ తీసేలా ఉంది. ఈ వర్ష ప్రభావం తో మ్యాచ్ నిర్వాహకుల్లో ఒకింత భయం పట్టుకుందని చెప్పాలి… ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్ కోసం దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశారు నిర్వాహకులు… మ్యాచ్ కోసం 2850 మంది పోలీసులతో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు నిర్వాహకులు…