పూర్ణ, సాక్షి చౌదరి, జయప్రద ప్రధాన పాత్రదారులుగా రూపొందిన చిత్రం ‘సువర్ణసుందరి’. సూర్య ఎమ్మెస్సెన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎం.ఎల్ లక్ష్మి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ......"గ్రాఫిక్స్కు ఎంతో ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. విఎ్ఫఎక్స్ కోసం ఏడాది వర్క్ చేశాం. తొలి కాపీ చూశాక సంతృప్తి కలిగి చిత్రవిజయంపై నమ్మకం పెరిగింది. ప్రస్తుతం సెన్సార్ జరుగుతోంది"అని చెప్పారు. "చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుందన్న క్యాప్షన్తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ నెల 31న విడుదల చేస్తాం" అని నిర్మాత తెలిపారు.