ఘోర రోడ్డు ప్రమాదంలో....... ఏడుగురు మృతి

SMTV Desk 2019-05-24 12:39:11  road accident, gwalior crime,

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలైన సంఘటన గ్వాలియర్ లో చోటుచేసుకుంది. శనివారం ఉదయం తొమ్మిది మందితో కారులో వెళుతుండగా... ప్రమాదవశాత్తు అదుపుతప్పి.. ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

కారు డ్రైవర్ అతి వేగంతో రావడంతో.. వాహనం అదుపుతప్పి.. ట్రక్కుని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారులోని ప్రయాణికులంతా రాజస్థాన్ కి చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు