‘గౌతమ్ ఎండలో.. గంభీర్ ఏసీలో’

SMTV Desk 2019-05-24 12:27:14  manish siscodia,

ఎన్నికలకు మరో రెండు రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆప్ తరఫున ఆతిషి, బీజేపీ నుంచి గౌతమ్ గంభీర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆతిషి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పాంప్లెట్లు పంచారు. వీటి వెనుక గౌతమ్‌ గంభీర్‌ ఉన్నారని ఆప్‌ నాయకులు ఆరోపించారు. ఇక తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ, గౌతమ్ గంభీర్‌పై సంచలన ఆరోపణ చేసింది. గంభీర్ ఎండ వేడిమిని తట్టుకోలేక అచ్చం తనలా ఉండే మరో వ్యక్తి చేత ప్రచారం చేయిస్తున్నారని ఆప్ నేత, డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో గంభీర్ కారులో కూర్చొని ఉండగా, నల్లటి టోపి ధరించిన మరో వ్యక్తి ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. ‘గౌతమ్ ఎండలో.. గంభీర్ ఏసీలో’ అని ఈ సందర్భంగా సిసోడియా వెటకారంగా ట్వీట్ చేశారు. కాగా.. మనీశ్ సిసోడియా పోస్ట్ చేసిన ఫొటోలో గంభీర్ కార్లో కూర్చొని ఉండగా, నల్లటి టోపీ ధరించిన మరో వ్యక్తి ప్రచారం నిర్వహించే దృశ్యాలు ఉన్నాయి.