పాకిస్థాన్ వైపు నుంచి భారత గగనతలంలోకి చొరబడిన భారీ కార్గో విమానం....

SMTV Desk 2019-05-24 12:15:43  pakistan, cargo flight, an-12

పాకిస్థాన్ వైపు నుంచి భారత గగనతలంలోకి చొరబడిన ఓ భారీ కార్గో విమానాన్ని భారత వాయుసేన విమానాలు బలవంతంగా దించేశాయి. ఈ మధ్యాహ్నం జైపూర్ సమీపంలో ఆంటోనోవ్ ఏఎన్-12 రవాణా విమానం గగనతల నిబంధనలు ఉల్లఘించి భారత గగనతలంలోకి ప్రవేశించగా, భారత వాయుసేనకు చెందని సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానాలు దాన్ని వెంబడించాయి.

భారత వాయుసేన పంపిన సంకేతాలను ఏఎన్-12 విమాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో దాన్ని జైపూర్ విమానాశ్రయంలో బలవంతంగా దించేశారు. ఆ విమానం జార్జియాకు చెందిన మోటార్సిచ్ అనే ఇంజినీరింగ్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు. అయితే, కరాచీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ విమానానికి ఏటీఎస్ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పయనించడం ఈ ఘటనకు కారణమైంది. కాగా, ఆ విమానంలో ఏముందన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి.