ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం

SMTV Desk 2019-05-09 14:32:22  Raod accident,

అమరావతి: ఏలూరులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేేేసుకుంది. విశాఖపట్టణం నుండి అమరావతి వెళ్తున్న ఆర్ టిసి బస్సు ఇనుప లోడుతో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా… మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప దవాఖానకు తరలించారు. మెయిన్ బైపాస్ రోడ్డులో ఈఘటన జరగడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

బస్సు ఢీకొనడంతో లారీలోని ఐరన్ రాడ్లు మొత్తం రోడ్డుపై పడిపోవడంతో గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.