భారత మత్స్యకారులు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారు. అక్రమంగా పాక్ జలాల్లోకి ప్రవేశించారంటూ 34 మంది మత్స్యకారులను సముద్ర తీర భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఆరు పడవలతో పాటు జాలర్ల వస్తు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు పాక్ అధికారులు. రేపు కరాచీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.