అమరావతి: ఈ రోజు ఏపి ఐసెట్ ఫలితాలను విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరవ్వగా 90.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే వీరికి జులై మూడోవారం నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. టాప్ టెన్ ర్యాంకర్స్.
1వ ర్యాంకు: కారుమూరి నాగసుమంత్ (గుంటూరు జిల్లా).
2వ ర్యాంకు: కె.కావ్యశ్రీ(తూర్పుగోదావరి జిల్లా).
3వ ర్యాంకు: ఎన్.శివసాయి పవన్(విజయవాడ).
4వ ర్యాంకు: యాగంటి ముని చంద్రారెడ్డి(కడప).
5వ ర్యాంకు: ఒ.భాను ప్రకాశ్(చిత్తూరు).
6వ ర్యాంకు: ఎం.వెంకటనాగేంద్ర(విశాఖ).
7వ ర్యాంకు: పి.వెంకటలక్ష్మి కిరణ్మయి(తూర్పుగోదావరి).
8వ ర్యాంకు: కె.భానుప్రకాశ్రెడ్డి(చిత్తూరు).
9వ ర్యాంకు: ఎ.అఖిల్(హైదరాబాద్).
10వ ర్యాంకు: అంబటి సురేందర్రెడ్డి(కర్నూలు).