ముంబై: మంగళవారం కూడా దేశీ మార్కెట్లు తీవ్ర నష్టాన్ని చూశాయి. దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాలు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ మార్కెట్లు కేదేలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమై 38,277 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు నష్టంతో 11,498 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 69.37గా కొనసాగుతుంది.