విష్ణు విశాల్-అమలా పాల్ జంటగా నటించిన తమిళ చిత్రం “రాక్షసన్”. బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. రాక్షసన్ తెలుగు రిమేక్ రాక్షసుడు. బెల్లకొండ సాయిశ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. ఐతే, విష్ణు విశాల్ పాత్రకి బెల్లకొండ న్యాయం చేయలేడని అమలా అన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై అమలా స్పందించారు.
“తాను చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వదంతి, నిందకి మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అది మీ కళ్లకు తెలియలేదా?” అని ట్వీట్ చేసింది అమలాపాల్. అమలా తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. బన్నీ-అమలా జంటగా నటించిన ఇద్దరమ్మాయిలతో మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే.