కొలంబో: శ్రీలంకలో పోయిన నెలలో వరుస బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులు చేసింది మేమే అని ఐసిస్ కు చెందిన నేషనల్ తౌహిద్ జమాత్ సంస్థ ఉగ్రవాదు ఒప్పుకున్నారు. దీంతో వారిపై పత్యేక దృష్టి పెట్టిన లంక పోలీసులు ఆ గ్రూపు వద్ద సుమారు 14 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. ఇంకా ఆ సంస్థ వద్ద సుమారు 700 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అంచనా. నగదులో సగం సిఐడి స్వాధీనం చేసుకున్నారు. మిగతా సగం బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్లు గుర్తించారు. ఐతే ఆ అకౌంట్లను రద్దు చేయనున్నారు. ఇప్పటివరకు వరుస పేలుళ్లకు సంబంధించి 74 మంది అనుమానితులను అరెస్టు చేశారు.