ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో టాటా ఇన్వెస్ట్!

SMTV Desk 2019-05-07 12:24:13  ratan tata, ola, ola electric mobility, ratana tata invested in Ola electric mobility

ముంబై: ప్రముఖ ఇండస్ట్రియలేస్ట్ రతన్ టాటా ఎలక్ట్రిక్ వెహికిల్(ఇవి) వ్యాపారం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ(ఒఇఎం)లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఓలా తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒఇఎంకు చెందిన సిరీస్ ‘ఎ’లో భాగంగా టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెడుతున్నారని పేర్కొంది. ఓలా ఎలక్ట్రిక్‌లో ఆయన పెట్టుబడితో ఆయన అపార అనుభవం, సలహాదారుగా సంస్థకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని ఓలా తెలిపింది. ఓలాకు చెందిన మాతృ సంస్థ ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో టాటా మొదటి ఇన్వెస్టర్‌గా ఉన్నారు. 2015 జూలైలో ఎఎన్‌ఐ టెక్నాలజీస్‌లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది మార్చిలో టైగర్, మాట్రిక్స్ ఇండియా ఆధ్వర్యంలో రూ.400 కోట్ల సమీకరణ కోసం ఒఇఎ ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ వెహికిల్ పర్యావరణ వ్యవస్థ ప్రతి రోజూ అభివృద్ధి చెందుతూ వస్తోందని.. వృద్ధిలో ఓలా ఎలక్ట్రిక్ కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నామని ఈ సందర్భంగా టాటా పేర్కొంది.