తాజాగా ఆయా రాష్ట్రాలను ఫణి తుపాను వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మోడీ చేసిన ఫోన్లకు తాను కావాలనే స్పందించలేదని అన్నారు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మోడీ కాలం ముగియనుందని.. ఆయన చెల్లిపోయిన ప్రధాని అని ఆమె మండిపడ్డారు. ఆయనతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం తనకు ఇష్టం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మోడీ పదవీకాలం ముగిసి పోయిందని... మళ్లీ ఆయన ప్రధాని కాలేరని మమతా బెనర్జీ వివరించారు.
అంతేకాకుండా ప్రధాని తనకు ఫోన్ చేసిన సమయంలో తాను ఖరగ్ పూర్ లో ఉన్నానని... తుపాను పరిస్థితిపై సమీక్షించేందుకు వెళ్లానని ఆమె వెల్లడించారు. ఆ సమయంలో తాను అక్కడ ఉంటే... మోడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆమె తెలిపారు.
అంతేకాకుండా మోడీ ప్రభుత్వం ఇచ్చే తుపాను సాయం తమకు అవసరం లేదని తెల్పిన మమతా బెనర్జీ.. గతంలో తుపాన్లు వచ్చినప్పుడు పశ్చిమబెంగాల్ కు మోడీ ఎందుకు సహాయం చేయలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.