టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ అంటూ ప్రేక్షకుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రమిది. అన్యసింగ్ హీరోయిన్గా నటిస్తుంది. ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ ఈ సినిమా కోసం నిర్మాతగా మారడం విశేషం. వెంకటాద్రి టాకీస్, వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ సంస్థలు ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ను నిన్న విడుదల చేశారు.మీరు చూసేయండి .