రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలని మొక్కుకున్న : హనుమంత రావు

SMTV Desk 2019-05-07 11:14:31  V hanumantha Rao, KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు . ఓవైపు రాష్ట్రంలో ఇంటర్ మార్కుల గందరగోళం కొనసాగుతుండగా, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కోసం కేరళ వెళ్లడంపై ఆయన ధ్వజమెత్తారు . విద్యార్థులు మరణిస్తే వెళ్లడానికి సుముఖత చూపని కేసీఆర్ కు కేరళ పర్యటన అంత ముఖ్యమైందా? అంటూ నిలదీశారు. ఇవాళ కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లడం తెలిసిందే. అక్కడ సీఎం పినరయి విజయన్ తో ఆయన ఫెడరల్ ఫ్రంట్ విషయం చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేసారు ..

ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి పారిపోయే పరిస్థితి వస్తుందని అన్నారు. వచ్చే రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవాలంటూ తాను పెద్దమ్మ గుడిలో మొక్కుకున్నట్టు వీహెచ్ చెప్పారు. ఇటీవలే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను తరిమికొట్టాలంటూ ప్రజలకు చెబుతానని అన్నారు.