ఆంధ్రప్రదేశ్, ఆగస్ట్ 23 : 2009 లో అసెంబ్లీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలను ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖాభివృద్ధి మంత్రిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావుకు అనకాపల్లి రెండో సివిల్ కోర్టు నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చేనెల 11కు వాయిదా వేశారు.