ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ సేవల్లో మార్పులు....!

SMTV Desk 2019-05-06 15:04:50  airtel, airtel postpaid plans

ప్రముఖ టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం అందిస్తున్న పోస్ట్‌పెయిడ్‌ సేవల్లో పలు మార్పులు చేసింది. ఇకపై రూ.399కు బదులుగా వినియోగదారులకు రూ.499 ప్లాన్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో అన్‌లిమిటెడ్‌ లోకల్‌ కాల్స్‌, ఎస్టిడి కాల్స్‌, 75 జిబి డేటా, ఏడాది పాటు ఉచిత అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌, టివి ప్రీమియం, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, హ్యాండ్‌ ప్రొటెక్షన్‌ సర్వీసులు లభిస్తాయి. అలాగే ఎయిర్‌టెల్‌ రూ. 749 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లో 125 జిబి డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు వంద ఎస్‌ఎంఎస్‌లు, అలాగే రూ. 999 పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లో 150 జిబి డేటా, రూ. 1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ డేటాలు వస్తాయి. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ బెనిఫిట్‌ సేవలు అన్నీ లభిస్తాయి.