బిజేపి ఎంపి అభ్యర్థి బండి సంజయ్ పై దాడి

SMTV Desk 2019-05-06 12:20:42  Bandi Sanjay,

కరీంనగర్ బిజేపి ఎంపి అభ్యర్థి బండి సంజయ్ వాహనం పై అదివారం రాత్రి ఇద్దరు యువకులు దాడి చేయడం సంచలనం రేపింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో బండి సంజయ్, ఎంపీటీసీ అభ్యర్థి మహేందర్‌లు ప్రచారం చేస్తున్నారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి మహేందర్, సంజయ్ లు ప్రచారం నిర్వహిస్తున్నారు. శివారెడ్డి అనే వ్యక్తి సంజయ్ ను దూషిస్తూ చెప్పుతో దాడి చేయగా.. పార్టీ శ్రేణులు, అభిమానులు అతడికి దేహశుద్ది చేశారు. ప్రచారం ముగించుకుని తిరిగి వెళ్తున్న సంజయ్ వాహనం దుర్శేడ్ వద్దకు రాగానే ఇద్దురు వ్యక్తులు పెట్రోల్ బాటిల్ తో వాహనం పోసి నిప్పు అంటించే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తం కావడంతో పరారాయ్యారు. దాడి చేసిన ఇద్దరు యువకులు శివారెడ్డి కుమారుడు వంశీ, మణిలు గా అనుమానిస్తున్నారు. ఇది ఇలా ఉండగా శివారెడ్డి కరీంనగర్ రూరల్ మండలం బిజేపి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఎంపిటిసి టిక్కెట్ విషయంలో విభేదాలు రావడంతో పార్టీ అతడిని తోలగించింది. సంజయ్ డ్రైవర్ రమేశ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.