పేలిన ఈ-బైక్.... ఐదుగురు దుర్మరణం, 38 మందికి గాయాలు!

SMTV Desk 2019-05-05 17:54:04  e bike, 38 injured, 5 died, crackers,

ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఉదాహరణగా నిలిచిన ఘటన ఇది. చైనాలో స్వయంప్రతిపత్తి ఉన్న గ్యాంగ్జిజువాంగ్ ప్రాంతంలో ఈరోజు అగ్నిప్రమాదం చెలరేగింది. గులియన్ లోని ఓ నివాస సముదాయంలో ఇంటి యజమాని తన విద్యుత్ తో నడిచే బైక్ కు చార్జింగ్ పెట్టాడు. అనంతరం బయటకు వెళ్లాడు.

అయితే వాహనంలో షార్ట్ సర్క్యూట్ తలెత్తడంతో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అనంతరం అది మంటలను ఎగజిమ్ముతూ పేలిపోయింది. ఈ మంటలు మిగతా ఇళ్లకూ వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా, 38 మందికి కాలిన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అధికారులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన చైనా పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.