అందాల తార త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పరమపదం విలయట్టు’. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిష ఓ దివ్యాంగురాలి తల్లిగా, వైద్యురాలి పాత్రలో కనిపించారు. ఓ రాజకీయ నాయకుడి వల్ల ఆమె సమస్యల్లో పడతారు.
కె.తిరుగననమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 24 HRS ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అమ్రిష్ బాణీలు అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.