టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

SMTV Desk 2019-05-05 16:00:52  TRS, etela rajender,

తెలంగాణాలో జరగబోయే స్థానిక ఎన్నికల కోసం తెరాస పార్టీ తరపున ప్రచారం లో పాల్గొన్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన కొన్ని సంచలనాత్మకమైన వాఖ్యలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వలన ఎవ్వరు కూడా మేలు పొందలేదని, అన్ని ఏళ్లుగా పాలనలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏమి లేదని అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తీ నమ్మకాన్ని కోల్పోయిందని, ఇక కాంగ్రెస్ పార్టీ ని ఎవ్వరు కూడా నమ్మరని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇన్ని ఏళ్లుగా కష్టాలు పడ్డ రైతులకు అండగా తెరాస పార్టీ ఆవిర్భవంచిందని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు 24గంటల కరంటు, రైతుబీమా, రైతుబంధు పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్య, రవాణా, ప్రజలకి అవసరమైన సౌకర్యాలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, ఇప్పటికే మిషన్‌ భగీరథ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈటల తెలిపారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులను నింపుతామని, ఇక రాష్ట్రం అంతకుడా పచ్చగా కనిపిస్తుందని మంత్రి అన్నారు. కాగా రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.