ముంభై: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్కపూర్ చెందిన అర్కే స్టూడియోస్ను తాజాగా గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్ని శుక్రవారం పూర్తయ్యాయి. అయితే దీని ధర ఎంతనేది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలనుకున్నప్పటికీ దీన్ని అమ్మకానికి పెట్టినట్లు స్టూడియోస్ యాజమాన్యం అనూహ్యంగా ప్రకటించింది. దీన్ని కొనుగోలు చేయడానికి ఎన్నో ప్రముఖ కంపెనీలు పోటీ పడినప్పటికీ చివరికి ఇది గోద్రేజ్కు దక్కింది.ఆర్కే స్టూడియోస్ను తమ ఆస్తుల్లో భాగం చేసుకున్నందుకు ఆనందంగా ఉందంటూ గోద్రేజ్ తెలిపింది. ఈ స్టూడియో ముంబయిలోని చెంబూరులో 2.2ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1970, 80ల నాటి కాలంలో ఎన్నో చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి.