యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన సైకో శ్రీనివాస్ రెడ్డి గురించి రోజుకో ఆశ్చర్యకరమైన కొత్త విషయం బయటపడుతున్నాయి. హాజీపూర్ గ్రామంలో ఎవరితోనే మాట్లాడకుండా ఒంటరిగా బ్రతికే అతనికి ఫేస్బుక్లో 327 మంది స్నేహితులు, వారిలో 60 మందికి పైగా అమ్మాయిలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు.
ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే అతను కూడా ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అతని గురించి తెలియక ఆమె కూడా అతనితో పెళ్ళికి సిద్దమైంది. ఆమె తల్లితండ్రులు కూడా వారి ప్రేమను అంగీకరించడంతో త్వరలో వివాహం చేయడానికి సిద్దపడ్డారు. ఆమె సిరిసిల్లా జిల్లాలో వేములవాడకు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఆమెతో దిగిన సెల్ఫీ ఫోటోను సైకో రెడ్డి తన ఫేస్బుక్లో పెట్టుకొన్నాడు.
అతను ఇంకా ఎక్కడైనా అత్యాచారాలు, హత్యలు చేశాడేమో తెలుసుకొనేందుకుగాను అతనిని విచారించేందుకు 5 రోజుల కస్టడీ కోరుతూ రాచకొండ పోలీసులు శుక్రవారం భువనగిరి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అది మంజూరైతే పోలీస్ విచారణలో ఇంకా అనేక కొత్త విషయాలు తెలియవచ్చు.