అమరావతి: రాష్ట్ర ప్రజలకు ఆర్టీజిఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఎండా తీవ్రత అధికంగా ఉండడంతో ముఖ్యంగా వృద్దులు, చిన్న పిల్లలు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఏపిలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్రోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నట్లు ఆర్టీజిఎస్ తెలిపింది. వడగాల్పులు వీస్తాయని ఎండలో వెళ్లినా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలని తెలిపింది.