కొలంబో: శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత నెలలో ఈస్టర్ రోజున కొలంబోలో వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు పాల్పడ్డ ఐసిస్ ఉగ్రవాదులు శ్రీలంకలోని బ్రిడ్జీలను కూల్చివేసేందుకు స్కెచ్ గీశారంటూ శ్రీలంక నావికాదళాన్ని అప్రమత్తం చేశారు. ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీచేయడంతో దేశంలో పోలీసులతోపాటు మిలటరీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐబీ హెచ్చరికలతో వంతెనల వద్ద గస్తీని మరింత పెంచారు.