న్యూఢిల్లీ: మే5 నుంచి మూడవ సీజన్లో భాగంగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ ఫుట్బాల్ పోటీలు జరగనున్నాయి. రైజింగ్ స్టూడెంట్స్ క్లబ్, గోకులం కేరళ ఫుట్బాల్ టీం పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలోని గురునానక్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్తో పోటీలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మహిళల ఫుట్బాల్ పోటీల్లో 12 జట్లు ఏ, బీ గ్రూపులుగా తలపడనున్నాయి. ఈ పోటీల్లో హన్స్ ఉమెన్ ఫుట్బాల్ క్లబ్, సెంట్రల్ ఎస్ఎస్బి ఉమెన్స్ ఫుట్బాల్ క్లబ్, పాంజిమ్ ఫుట్బాలర్స్, రైజింగ్ స్టూడెంట్స్ క్లబ్, గోకులం ఫుట్బాల్ క్లబ్ అల్కపుర, మణిపూర్ పోలీసు, సేతు ఫుట్బాల్ క్లబ్, బెంగళూరు యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్, సాయి ఎస్టీసీ కటక్, కొల్హాపూర్ సిటీ ఫుట్బాల్ క్లబ్, బరోడా ఫుట్బాల్ అకాడమీలు పాల్గొననున్నాయి. మహిళల ఫుట్బాల్ పోటీలు ఆసక్తికరంగా సాగుతాయని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుషాల్ దాస్ చెప్పారు.