‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ను చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఇది ఓ యుద్ధం.. ఈ యుద్ధంలో నేను చంపొచ్చు, చావచ్చు. కానీ చంపినా, చచ్చినా నేను వెళ్లేది మాత్రం స్వర్గానికే..’ అంటూ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది చెబుతున్న డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఆ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది చేసే వరుస పేలుళ్లతో అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఐదుగురు భారతీయులు చేసే ప్రయత్నమే ‘ఇండియాస్ మోస్ట్ వాండెట్’ సినిమా కథ.
భారత దేశంలో ఎన్నో బాంబు దాడులకు పాల్పడి ఎంతో మందిని పొట్టనబెట్టుకున్న కరఢుగట్టిన ఉగ్రవాది ‘ఒసామా’ జీవితం ఆధారంగా తీసిన సినిమా ఇది. ఇందులో ఒసామా ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలియని ఐదుగురు వ్యక్తులు ఎలాంటి వ్యక్తుల సహాయం లేకుండా., ఆయుధాల సహాయం లేకుండా అతన్ని పట్టుకోవాడానికి ఏం చేశారు, ఎలాంటి కష్టాలు పడ్డారు అనే దానిపై సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఉగ్రవాదుల మారణకాండతో విసిగిపోయి ఉన్న ప్రేక్షకులకు మే 24న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.